వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్కు తక్షణమే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కోరారు. ఏడు కారిడార్లతో కూడిన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దాదాపు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో 129 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ జరగనుంది. ఎయిర్పోర్ట్-ఫ్యూచర్సిటీ కారిడార్ను మూడో దశ కింద చేపట్టాలని, నగరాభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టు అత్యవసరమని ముఖ్యమంత్రి కేంద్రానికి వివరించారు.
Comments
Loading comments...

