వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ ఈనెల 10న హైదరాబాద్లో పర్యటించనున్నారు. జహీరాబాద్ స్మార్ట్సిటీ, వరంగల్ టెక్స్టైల్ పార్క్ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి.
పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. జనసమీకరణ కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశారు. సుమారు రెండు లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Loading comments...

