Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సమస్యలపై ఢిల్లీలో వైసీపీ పోరాటం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 14, 2026 2:23 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయుల సమస్యలపై ఢిల్లీలో వైసీపీ పోరాటం - Udayam
ఇన్-సర్వీస్ టీచర్లకు TET మినహాయింపు, DSC అక్రమాలపై విచారణ కోరుతూ వైసీపీ నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. వైవీ సుబ్బారెడ్డి ఛాంబర్‌లో ఎంపీలతో సమావేశమై ఉపాధ్యాయుల సమస్యలపై కార్యాచరణ రూపొందించారు. TET అంశంపై పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్‌కు చర్యలు చేపడతామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...