వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో వైకాపా చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందంటూ పోలీసులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు. అనుమతి లేదని నిన్న వైకాపా నేతలకు నోటీసులు ఇచ్చారు.
అయినా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అనుచరులతో కలిసి శిబిరానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసు వాహనాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

