వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు.
ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి కుటుంబ సభ్యుడిలా సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

