Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపంలో హుండీ చోరీ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:34 PM మహబూబాబాద్ General
వినాయక మండపంలో హుండీ చోరీ - Udayam
కేసముద్రం మున్సిపాలిటీ 16వ వార్డులో టీమ్‌ గణనాథ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదు తీసుకున్న అనంతరం విగ్రహం వద్ద రూ.116 వదిలి వెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం హుండీ కనిపించకపోవడంతో చోరీ వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...