వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ లేబరుకాలనీ మైదానంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల పర్యావరణహిత శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాల్గవ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఆదివారం సాయంత్రం నిర్వహించిన వినాయకుడి ఆగమన కార్యక్రమంలో మంత్రి సవిత హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలతో కలిసి కోలాటం ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.
Comments
Loading comments...

