వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. నరసరావుపేట నుంచి వచ్చిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన అఫిక్ అలీ పొరపాటున మరో ప్రయాణికుడి బ్యాగ్ తీసుకెళ్లారు. బ్యాగ్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు.
తనిఖీలో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు లభించాయి. బ్యాగ్ ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

