వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన గోపాల్రావు, సదాశివ, కిషన్రావు, దాజి శంకర్, కాస్తల రామకిష్టు, ఎల్లన్న సేవలను గుర్తించాలని కమ్యూనిస్టు నేత రాఘవులు కోరారు. వారి త్యాగాలను నేటి తరానికి తెలియజేయాలని సూచించారు.
1972లో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో వారి స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి స్తూపాల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.
Comments
Loading comments...

