వార్తలకు తిరిగి వెళ్లండి

రజాకార్లను ఎదిరించిన కత్తి సాంబయ్య, గొల్ల బక్కయ్య, గొల్ల కనుకయ్య, భాషబోయిన చిన్న నర్సయ్యలను పట్టుకెళ్లి పాకాల అడవుల్లో కాల్చిచంపారని తిమ్మంపేట గ్రామస్థులు తెలిపారు. రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన చరిత్రకు రక్షణ బురుజు సాక్ష్యంగా ఉందన్నారు.
కొమటి లింగయ్య, గాదం నర్సయ్య, నాగెల్లి ముత్తయ్య, కుమ్మరికుంట్ల బొందయ్య తదితరులు కూడా తిరుగుబాటులో పాల్గొన్నారని గ్రామస్థులు తెలిపారు.
Comments
Loading comments...

