వార్తలకు తిరిగి వెళ్లండి
వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గేటు వద్ద పరిగి–మహబూబ్నగర్ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 7 గంటలు మాత్రమే సరఫరా అవుతోందని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని తెలిపారు. హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

