వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రాజంపేట విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి అన్నారు. శనివారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు రెండింటినీ సమానంగా స్వీకరించాలన్నారు.
క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

