వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో ఆదివారం ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి డివిజన్లోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపిక అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి రాజేందర్, ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

