వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్ల మండలం రామగోపాలపురం (రంగన్నపల్లి)లో గణేష్ లడ్డూ వేలంపాట రూ.50 వేలకు ముగిసింది. కమతం వెంకటరెడ్డి కుమారులు వెంకటేష్, భార్గవ్ లడ్డూను దక్కించుకున్నారు. రూ.1,000తో ప్రారంభమైన వేలం రూ.50 వేల వరకు సాగింది.
మేళతాళాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ లడ్డూను వారు ఇంటికి తీసుకెళ్లారు. గతేడాది ఇదే లడ్డూ రూ.70 వేలకు పలికింది.
Comments
Loading comments...

