వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన వైసీపీ నేత జయచంద్రారెడ్డికి కడప 1 టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎంపికపై అనుమానాలు ఉన్నాయని చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని కోరారు.
ప్రభుత్వం, పోలీస్ శాఖపై ప్రజల్లో అపోహలు, అభద్రతాభావం కలిగించేలా నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. 7 రోజుల్లో ఆధారాలు, సాక్ష్యాలు, అధికారిక సమాచారాన్ని సమర్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

