వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రా గాంధీ వావిలాల గోపాలకృష్ణయ్య నిస్వార్థత, నిజాయితీకి ప్రతీకగా నిలిచారని వక్తలు కొనియాడారు. గురువారం శ్రీకాకుళంలోని గాంధీ మందిరం స్మృతివనంలో వావిలాల 120వ జయంతి వేడుకలు నిర్వహించారు.
గాంధీజీ ఆశయాల బాటలో పయనిస్తూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా ప్రతినిధిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. వావిలాల జీవితాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

