వార్తలకు తిరిగి వెళ్లండి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి తదితర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు.
ఈ సందర్భంగా నిర్వహిస్తున్న లడ్డూ వేలంపాటలు హోరాహోరీగా సాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలంలో ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. భజనలు, కోలాటాలు, డీజేలు, భక్తిగీతాల మధ్య గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు.
Comments
Loading comments...

