Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:20 AM అనంతపురంGeneral
ఉరవకొండలో రోడ్డు ప్రమాదం - Udayam
అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. కోర్టు పనిపై వచ్చి బైక్‌పై తిరుగుప్రయాణమైన వారిని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనాన్ని అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లడంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...