వార్తలకు తిరిగి వెళ్లండి

జులైలో యూపీఐ ద్వారా 23.66 బిలియన్ లావాదేవీలు జరిగి, వాటి విలువ రూ.29.88 లక్షల కోట్లకు చేరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఇది ఇప్పటివరకు అత్యధికం.
గతేడాదితో పోలిస్తే లావాదేవీల సంఖ్య 22 శాతం, విలువ 19 శాతం పెరిగినట్లు తెలిపింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరగడం ఇందుకు కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...
