వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో పరిశోధకురాలు ధానోతు ఉదయశ్రీ పీహెచ్డీ ఓపెన్ వైవాను విజయవంతంగా పూర్తి చేశారు.
డాక్టర్ బి. సాయిలు పర్యవేక్షణలో ‘క్వినజోలినోన్ సమ్మేళనాల రూపకల్పన, తయారీ, ఔషధ గుణాల మూల్యాంకనం’పై పరిశోధన చేశారు. బాహ్య పరీక్షకుడు ప్రొఫెసర్ పి. రామచందర్ ఆమె పరిశోధనను ప్రశంసించి పీహెచ్డీ పట్టాకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు ఉదయశ్రీని అభినందించారు.
Comments
Loading comments...

