వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రూ.50 వేల లంచం తీసుకుంటూ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయికృష్ణ ఏసీబీకి చిక్కారు. పన్ను తగ్గించేందుకు వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
వ్యాపారి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని ఇద్దరినీ పట్టుకుని కేసు నమోదు చేశారు. డీఎస్పీ మధు తెలిపారు, నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు.
Comments
Loading comments...

