వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థను తుర్కియే ప్రతినిధులు మసూద్, నూరుల్లా ప్రశంసించారు. గురువారం విద్యాశాఖ అధికారులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, కేజీబీవీలు, గురుకులాలపై వివరాలు తెలుసుకున్నారు.
తమ దేశంలోనూ రెసిడెన్షియల్ విద్య అవసరమని, తెలంగాణ నమూనా అమలుకు ప్రతిపాదిస్తామని తెలిపారు. ఇరు దేశాల విద్యా వ్యవస్థలు, బాలికా విద్య, ఆంగ్ల మాధ్యమ బోధనపై చర్చించారు.
Comments
Loading comments...

