వార్తలకు తిరిగి వెళ్లండి

కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని 8, 10వ వార్డుల్లో తాగునీటి అవసరాల కోసం సర్పంచ్ యుగంధర్రెడ్డి ఆధ్వర్యంలో నూతన బోర్లు ఏర్పాటు చేశారు. వార్డు సభ్యులు గంట మల్లేష్, బిజిలి లింగం సహకరించారు.
ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో కాలనీవాసులు సర్పంచ్, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజు, చిట్టి, ధనమ్మ, సాయిబాబారాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

