వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్ కాశీంబౌలిలోని 120 అడుగుల పాడుబడిన వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. విషసర్పాలు, ముళ్లపొదలు ఉన్నప్పటికీ ఎస్సై వెంకన్న నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.
ఎనిమిది తాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

