వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా విద్యార్థులకు కొత్త ఏకరూప దుస్తులు అందలేదు. వస్త్రం పూర్తిస్థాయిలో జిల్లాలకు చేరకపోవడంతో పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు.
ఆగస్టు 15లోగా ఒక జత అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కొంత వస్త్రం వచ్చిందని, కుట్టు పనులు జరుగుతున్నాయని డీఆర్డీవో తెలిపారు. పాత దుస్తులు చిరిగి, పొట్టిగా మారడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

