Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయపాలెం క్యాంపస్‌లో 50 మంది విద్యార్థులు అస్వస్థత

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 10:55 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
బోయపాలెం క్యాంపస్‌లో 50 మంది విద్యార్థులు అస్వస్థత - Udayam
బోయపాలెంలోని శశి ఇంటర్‌ క్యాంపస్‌లో మూడు రోజులుగా సుమారు 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 23 మంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఆహారం లేదా తాగునీరు కలుషితం కావడమే కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆహారం, నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణం తేలనుంది.

Comments

G
Loading comments...