వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని పసిపిల్లల వార్డులో వీధికుక్కలు సంచరిస్తుండటంపై రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
వైద్యసేవలకు వచ్చే వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధికుక్కల బెడదను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రోగుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

