వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో శారదా నది పరిశుభ్రతకు జీవీఎంసీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. సోమవారం నది పరిసరాలను ఆయన పరిశీలించారు.
తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న నది చెత్తాచెదారంతో కలుషితమవుతోందని ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనాలకు ముందు నది తీరాన్ని శుభ్రం చేసి, విద్యుత్ సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

