వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మలరామారం మండలం మైలారానికి చెందిన శ్రీశైలం తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రెండోసారి ఎన్నికయ్యారు. చెంగిచెర్లలో ఆగస్టు 22 నుంచి 24 వరకు జరిగిన జీఎంపీఎస్ నాలుగో మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు.
మరోసారి అవకాశం కల్పించిన కమిటీకి శ్రీశైలం కృతజ్ఞతలు తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

