వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.
అక్టోబరు 11 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. అర్హత మార్కుల్లో మార్పు చేయలేదు. ఈ టెట్ ఉత్తీర్ణత ఉద్యోగ కొనసాగింపు లేదా పదోన్నతికి మాత్రమే వర్తిస్తుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

