వార్తలకు తిరిగి వెళ్లండి

నేర నియంత్రణలో ప్రతిభ కనబరిచిన 11 మంది పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందించారు.
రాయితీ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు రిమ్స్లో సెల్ఫోన్ దొంగలను పట్టుకోవడంలో సిబ్బంది చూపిన ప్రతిభను ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

