Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రాయితీపై సోలార్‌ క్రాప్‌ డ్రైయర్లు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 12, 2026 12:28 PM జగిత్యాలతెలంగాణ
రైతులకు రాయితీపై సోలార్‌ క్రాప్‌ డ్రైయర్లు - Udayam
రైతులకు పంట ఉత్పత్తుల ఆరబెట్టే ఇబ్బందులు తగ్గించేందుకు ఉద్యానశాఖ సోలార్‌ క్రాప్‌ డ్రైయర్లను రాయితీపై అందిస్తోంది. జగిత్యాలలో పసుపు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో మిరప, మామిడి ఉత్పత్తులకు ఇవి ఉపయోగపడనున్నాయి. 70 కిలోల యూనిట్‌కు రూ.లక్ష, 100 కిలోల యూనిట్‌కు రూ.1.40 లక్షల వరకు రాయితీ ఉందని ఉద్యానశాఖ అధికారిణి కె.లత తెలిపారు. ఒక్కో రైతు ఐదు యూనిట్ల వరకు పొందవచ్చని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...