వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లో ఆర్థిక ఇబ్బందులతో నరేశ్(33), మేఘన(30) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది రూ.90 లక్షలతో ఇల్లు కొనుగోలు చేసిన నరేశ్కు హోమ్లోన్ మంజూరు కాకపోవడంతో అప్పులు పెరిగి ఇంటిని అమ్మేశారు.
అప్పుల భారంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు నరేశ్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. మృతురాలి తండ్రి మోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

