Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్‌లో ఇసుక అక్రమ రవాణా జోరు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 12, 2026 12:32 PM నాగర్ కర్నూల్తెలంగాణ
నాగర్‌కర్నూల్‌లో ఇసుక అక్రమ రవాణా జోరు - Udayam
నాగర్‌కర్నూల్ పట్టణానికి పది రోజులుగా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా నిలిచిపోవడంతో అక్రమ రవాణా పెరిగిందని సమాచారం. మీ-సేవలో బుకింగ్‌ లేకపోవడంతో కొల్లాపూర్‌, అచ్చంపేటలోని రీచ్‌లే అందుబాటులో ఉన్నాయి. దుందుభి వాగు పరిసరాల నుంచి రాత్రివేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పలు వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...