Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 10:20 AM సంగారెడ్డితెలంగాణ
జహీరాబాద్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి - Udayam
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వర్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతిచెందిన విషయం తెలుసుకున్న సీఎం.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...