వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో వృత్తిదారులు, శిల్పులు, కార్మికుల నైపుణ్యానికి విశిష్ట స్థానం ఉంటుందని DRO సత్తబాబు అన్నారు. గురువారం విశ్వకర్మ జయంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో బిసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరైనారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృత్తి నైపుణ్యమే సమాజ ప్రగతికి పునాదని అన్నారు.
Comments
Loading comments...

