వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణాన్ని 2028 జులై నాటికి పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం పనులు నిలిపివేసిందని ఆరోపించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సొరంగ పనులు తిరిగి ప్రారంభించిందన్నారు. సొరంగం పూర్తయితే నల్గొండ ప్రాంత రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...
