వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభకు రాకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
Comments
Loading comments...

