వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గొల్లవానితిప్పకు చెందిన భక్తురాలు కొప్పర్తి బేబీ శ్రీ ఫణి అనీషా రూ.2.20 లక్షల విలువైన వెండి వస్తువులను సమర్పించారు. వీటిలో 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె, ఉద్ధరిణి ఉన్నాయి.
ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఛైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

