Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం మేయర్ పీఠంపై టిడిపిలో ఉత్కంఠ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:06 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం మేయర్ పీఠంపై టిడిపిలో ఉత్కంఠ - Udayam
శ్రీకాకుళం నగర మేయర్ పీఠం కోసం టిడిపిలో రాజకీయం వేడెక్కింది. మేయర్ అభ్యర్థిత్వం కోసం దాదాపు 23 మంది తమ బయోడేటాలను అందించినట్లు సమాచారం. రేసులో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ పైడిశెట్టి జయంతి, డాక్టర్ పైడి సింధూర పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారు కావడం కీలకమని, దీనిపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని నేతలు వెల్లడించారు.

Comments

G
Loading comments...