వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలోని ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 133 ఆశ్రమ ఉన్నత, 928 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. చివరిసారిగా 2012లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు.
ఆ తర్వాత సీనియర్ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో సగానికిపైగా పాఠశాలలు సీఆర్టీలతోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత సమస్యగా మారింది.
Comments
Loading comments...

