Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతలో చిరుత కలకలం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:56 AM అనంతపురంGeneral
అనంతలో చిరుత కలకలం - Udayam
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గ్రామ పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. రైతు మధు వేరుశనగ పొలంలో పని చేస్తుండగా పెద్ద వంకలో అలజడి వినిపించడంతో వెళ్లి చూడగా గడ్డిలో నుంచి చిరుత పరుగెత్తుతూ వెళ్లింది. ఈ దృశ్యాలను సమీపంలోని గొర్రెల కాపరి ఫొటోలు తీశాడు. మొన్న మురడి వద్ద కూడా ఇదే చిరుత కనిపించిందని ఫారెస్టు అధికారి దామోదర్ తెలిపారు. కొండ వెంబడి చిరుత సంచరిస్తుండవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...