వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలోని శాఖా గ్రంథాలయ భవనం తీవ్ర శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో అక్కడకు వచ్చే విద్యార్థులు, పాఠకులు భయాందోళన నడుమ చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
వర్షాకాలంలో భవనం ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత భవనాన్ని పరిశీలించి నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
Comments
Loading comments...

