వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పరిహారం చెల్లింపులకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. తొలి విడతలో 2,557 కుటుంబాలకు పరిహారం జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మిగిలిన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తోంది.
ఇప్పటికే 2,478 కుటుంబాల వివరాలు అప్లోడ్ చేయగా, మరో 921 కుటుంబాల సమాచారం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వారి ఖాతాల్లో పరిహారం జమ చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
