వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఓటర్ల జాబితాలో పేర్లు ఎలాంటి తప్పులు లేకుండా సరిగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

