వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షెట్టిపేటలోని జడ్పీ బాలికల పాఠశాలలో వరద నీరు ప్రవేశించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం నుండి పట్టణంలో భారీ వర్షం పడుతోంది. దీంతో బస్టాండ్ సమీపంలో ఉన్న బాలికల పాఠశాల ఆవరణలో వరద నీరు భారీగా ప్రవేశించింది.
దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు, బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల కొంత లోతట్టులో ఉండడంతో వరద నీరు ప్రవేశించి ఉంటుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
