వార్తలకు తిరిగి వెళ్లండి
సరస్వతి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం

సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఆలయ వేదపండితులు, అర్చకులు, వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగనున్నాయి.
గురు ప్రార్థన, వ్యాసపౌర్ణమి సంకల్పం, గోపూజ, హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...