వార్తలకు తిరిగి వెళ్లండి

‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్ పేరుతో మోసం జరిగిందనే ఫిర్యాదుపై బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్కు చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 5న హాజరుకావాలని ఆదేశించింది.
వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది. రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టినా ఒప్పందం ప్రకారం సహకారం అందలేదని ఆయన ఆరోపించారు. దీంతో పాటు కంపెనీ డైరెక్టర్లకూ సమన్లు జారీ అయ్యాయి.
Comments
Loading comments...
