వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు నిరంతరంగా అందేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను MLA కిమిడి కళా వెంకటరావు ఆదేశించారు.
శనివారం రాజాంలోని తన నివాసంలో RWS అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ కింద 74 పనులకు రూ.4.84 కోట్ల నిధులు మంజూరైనట్లు అధికారులు వివరించారు. అనంతరం MLA మాట్లాడుతూ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

