వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం కుమార్తె షేక్ ఆసిఫా(24) గుంటూరు శివారు ఏటుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్నేహితులతో కలిసి చీరాల వెళ్తుండగా వీరి కారు ముందున్న లారీని ఢీకొట్టింది.
ప్రమాదంలో ఆసిఫా తలకు తీవ్రగాయాలు కాగా, మరో నలుగురు గాయపడ్డారు. ఆసిఫా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రుత్విక్ ఫిర్యాదుతో నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...
